Breaking News: హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - Mar 19 , 2025 | 09:39 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-19T21:29:32+05:30
మరోసారి హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అన్న హైకోర్టు
ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా?
మియాపూర్, దుర్గం చెరువు ఆక్రమణ పరిస్థితి ఏంటీ?
అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అన్న హైకోర్టు
హైడ్రా పనితీరు అశాజనకంగా లేదన్న ఉన్నత న్యాయస్థానం
‘మీరాలం’పై ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆదేశం
తహసీల్దార్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుకు ఫాతిమా అనే మహిళ
విచారణ సందర్భంగా హైడ్రాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
-
2025-03-19T20:58:00+05:30
హైదరాబాద్: కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి..
మద్యం, బీరు కంపెనీలు కొత్త ఉత్పత్తులను సప్లయి చేయడానికి..
మార్చి 15 వరకు గడువు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ
ఇప్పటి వరకు టీజీబీసీఎల్కు కొత్త కంపెనీల నుంచి 39 దరఖాస్తులు
ఏప్రిల్ 2 వరకు గడువు పెంపు
-
2025-03-19T17:50:04+05:30
ఏపీ ప్రజలకు పెద్ద శుభవార్త..
అమరావతి: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసిన కేంద్రం.
రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటిపోవడంతో తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరిన సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం.
కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్లు ద్వారా ఎంపిక చేసిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.
రెండు నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థ ఎంపిక.
విశాఖలో రూ. 84.47 లక్షలు, విజయవాడలో రూ. 81.68 లక్షలతో ప్లాన్ రూపొందించనున్న సంస్థ.
ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేసిన సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం.
-
2025-03-19T13:51:10+05:30
బడ్జెట్పై బీజేపీ రియాక్షన్
బడ్జెట్పై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యేలు
ఏబీఎన్ తో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ బోగస్
గతంలో ముఖ్య మంత్రి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్యాన్సర్ పట్టుకుందన్నారు
దానికి అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన చేశారు
అంకెల గారడీని కేసీఆర్ని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకున్నారు
కేసీఆర్ అధికారంలో ఉండగా బడ్జెట్ లో చెప్పిన దాంట్లో పది శాతం ఖర్చు చేయలేదు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు బడ్జెట్ లో నిధులు పెట్టి రూపాయి ఖర్చు చేయలేదు
ప్రస్తుతం కాంగ్రెస్ ఒక్క కార్పొరేషన్కి రూపాయి కేటాయించలేదు
ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు వెళితే బయటకు నెట్టేస్తున్నారు
అంకెల గారడీని ఆపి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్ రెడ్డికి మంచిది
-
2025-03-19T12:20:12+05:30
బడ్జెట్లో కేటాయింపులు ఇలా
ఎస్సీ సంక్షేమానికి : రూ.40,232 కోట్లు
ఎస్టి సంక్షేమానికి : రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమానికి : రూ.11,405 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి : రూ.3,591 కోట్లు కేటాయింపు
ఐటీ శాఖకు : రూ.7,704 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు : రూ.12,393 కోట్లు
విద్యుత్ శాఖకు : రూ. 21,221 కోట్లు
H సిటి డెవలప్మెంట్ కి : రూ.150 కోట్లు
MA & UD శాఖకు : రూ.17,677 కోట్లు
నీటి పారుదుల శాఖకు : రూ.23,373 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు : రూ.5,907 కోట్లు
పర్యాటకశాఖ కు : రూ.775 కోట్లు
క్రీడా శాఖకు : రూ.465 కోట్లు
ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ : రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ కు : రూ.190 కోట్లు
హోంశాఖ కు : రూ.10,188 కోట్లు
-
2025-03-19T12:14:14+05:30
కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన బీజేపీ శ్రేణులు
గజ్వేల్ ఎమ్మెల్యే కనబడటం లేదని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయన్ని ముట్టడించిన బిజేపీ నాయకులు
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటుకు టూలెట్, వాంటెడ్ బోర్డులను అతికించి నిరసన
గజ్వేల్ ప్రజలు గుర్తున్నారా కేసిఆర్ అంటూ నిరసన తెలిపిన గజ్వేల్ బిజెపి శ్రేణులు
-
2025-03-19T11:42:26+05:30
తెలంగాణ బడ్జెట్లో అంకెలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ : రూ.3,04,965 కోట్లు
రెవెన్యూ వ్యయం : రూ. 2,26,982 కోట్లు
మూలధన వ్యయం : రూ. 36,504 కోట్లు
రైతు భరోసా కోసం : రూ. 18వేల కోట్లు
వ్యవసాయ శాఖ : రూ. 24,439 కోట్లు
పశు సంవర్డక శాఖ : రూ. 1,674
సివిల్ సప్లై : రూ. 5,734 కోట్లు
విద్యా శాఖ : రూ. 23,108 కోట్లు
కార్మిక ఉపాధి కల్పన : రూ. 900 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ : రూ. 31,605 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ : రూ. 2862 కోట్లు
-
2025-03-19T11:17:13+05:30
బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క
తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం
ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం
విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నాం
రైతుల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది
నీకు కనిపించిన బలహీనులైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో.. నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అన్న మహత్మా గాంధీ మాటలను గుర్తుచేసిన భట్టి విక్రమార్క
గాంధీ మాటలను పాటిస్తూ ముందుకెళ్తున్నాం.
-
2025-03-19T11:11:42+05:30
ప్రజా ప్రయోజనాలే థ్యేయంగా పనిచేస్తున్నామన్న భట్టి
ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది
జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన అందించడంలో సఫలీకృతమయ్యామని భావిస్తున్నాం
తెలంగాణ ప్రజలు మాపై విశ్వాసంతో అధికారం అప్పగించారు
తెలంగాణ ప్రజలు అప్పగించిన బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టలేదు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
కొందరు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
ప్రజలకు నిజం చెప్పకపోతే అవాస్తవాలను నిజాలని నమ్మే అవకాశం ఉంది
-
2025-03-19T10:04:58+05:30
రూ.3.20 లక్షలతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం
మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
యువతకు ఈ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఉండే ఛాన్స్
-
2025-03-19T09:43:32+05:30
కాసేపట్లో తెలంగాణ మంత్రిమండలి సమావేశం
కాసేపట్లో తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు ఆమోదం తెలపనున్న తెలంగాణ మంత్రిమండలి
సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం
-
2025-03-19T09:39:48+05:30
ఇవాళ తెలంగాణ బడ్జెట్
శాసనసభలో తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
ఎన్నికల హామీల అమలుకు నిధులు కేటాయించే అవకాశం
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత
యువత, మహిళా సాధికారతకు పెద్దపీట వేసే అవకాశం