Share News

TGSRTC: పుష్పక్‌ బస్సుల్లో చార్జీల పెంపు..

ABN , Publish Date - Aug 01 , 2025 | 09:46 AM

పుష్పక్‌ బస్సుల్లో రాత్రిపూట రూ. 100, పగటి పూట రూ. 50 చార్జీలు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తోంది ఆర్టీసీ. నగరంలో పలు ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడుపుతున్న పుష్పక్‌ బస్సుల్లో చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TGSRTC: పుష్పక్‌ బస్సుల్లో చార్జీల పెంపు..

- రాత్రి రూ. 100, పగలు రూ. 50.. ప్రయాణికుల ఆగ్రహం

హైదరాబాద్‌ సిటీ: పుష్పక్‌ బస్సుల్లో రాత్రిపూట రూ. 100, పగటి పూట రూ. 50 చార్జీలు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తోంది ఆర్టీసీ. నగరంలో పలు ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి(Airport) నడుపుతున్న పుష్పక్‌ బస్సుల్లో చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం బస్‌ పాసుల ధరతో పాటు టి24 టికెట్‌ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఎయిర్‌పోర్టు రూట్లలో నడిచే పుష్పక్‌ బస్సులో(Pushpak buses) ఏకంగా రూ. 100 పెంచింది.


city6.3.jpg

రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పుష్పక్‌ బస్సుల్లో విమానాశ్రయానికి వెళ్లాలంటే ఒక్కో ప్రయాణికుడికి రూ. 450, ఉదయం 6 నుంచి రాత్రి 9.55 గంటల వరకు రూ. 350 చార్జీ వసూలు చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బస్‌చార్జీలను ఆర్టీసీ పెంచుతోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 09:46 AM