Share News

Maoists: అడవిలో రక్తపుటేరులు

ABN , Publish Date - May 09 , 2025 | 03:39 AM

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు కూంబిం గ్‌ చేస్తుండగా..

Maoists: అడవిలో రక్తపుటేరులు

మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్ల మృతి

  • ఒక ఆర్‌ఎస్సైకి తీవ్ర గాయాలు

  • ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సల్స్‌ మృతి అని ప్రచారం

ములుగు/వాజేడు/వరంగల్‌ క్రైం/ఘట్‌కేసర్‌/మంచిర్యాల/ హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు కూంబిం గ్‌ చేస్తుండగా.. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లు.. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన సందీప్‌, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన పవన్‌కల్యాణ్‌, కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్‌ అక్కడిక్కడే మృతిచెందారు. అనంతరం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఆర్‌ఎస్సై రణధీర్‌కు బుల్లెట్‌ గాయమైనట్టు తెలిసింది. పోలీసుల మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగుకు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.


గాయపడ్డ ఎస్సైను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కానిస్టేబుళ్ల మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు తరలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న డీజీపీ జితేందర్‌, గ్రేహౌండ్స్‌ డీజీ స్టీఫెన్‌ రవీంద్ర, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. మరణించిన కమాండోల కుటుంబాలకు అండగా ఉంటామని డీజీపీ ప్రకటించారు. కాగా మందుపాతరపేలిన తర్వాత మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, 8మంది మావోయిస్టులు మృతిచెందారని.. వీరిలో మావోయిస్టుపార్టీ అగ్రనేతలు చంద్రన్న, బండిప్రకాశ్‌ ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. బండి ప్రకాశ్‌(60) అలియాస్‌ క్రాంతి అలియాస్‌ ప్రభాత్‌ది మంచిర్యాల జిల్లా మందమర్రి.


6 నెలలు కాల్పుల విరమణ పాటిస్తాం..!

  • మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట లేఖ

రాష్ట్రంలో ఆరు నెలలు కాల్పుల విరమణ పాటించనున్నట్టు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట గురువారం లేఖ విడుదలైంది. శాంతిచర్చలు జరపాలని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్‌ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ, ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా వస్తోందన్నారు. సీపీఐ(ఎం), ఇతర వామపక్షాలు ఇప్పటికే ఈ డిమాండ్‌తో కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 06:00 AM