Share News

మంత్రి తుమ్మలతో జార్ఖండ్‌ మంత్రి శిల్పి నేహ భేటీ

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:16 AM

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జార్ఖండ్‌ వ్యవసాయ మంత్రి శిల్పి నేహ భేటీ అయ్యారు. రైతుల సంక్షేమ పథకాలపై చర్చించిన ఈ సమావేశంలో ఆయిల్‌పామ్‌, కృత్రిమ మేధస్సు వినియోగం, హార్టికల్చర్‌ రంగ అభివృద్ధి పై చర్యలు తీసుకోవడం అన్నింటిపై సమీక్షించారు

మంత్రి తుమ్మలతో జార్ఖండ్‌ మంత్రి శిల్పి నేహ భేటీ

  • రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాలపై చర్చ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను జార్ఖండ్‌ వ్యవసాయశాఖ మంత్రి శిల్పి నేహ తెలుసుకున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఆమె భేటీ అయ్యారు. ఇరువురు మంత్రులు పరస్పరం తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న రైతు పథకాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను శిల్పి నేహకు మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహంతోపాటు దాన్ని లాభదాయక పంటగా తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇక వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం, కొత్త పథకాలు, రైతులకు లాభదాయకం చేసే విధానాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు హార్టికల్చర్‌ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఆ రంగ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ పరిష్కారాలను వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం రైతులకు కేటాయించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ పూర్తి చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. రూ.20,616 కోట్లతో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేశామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 03:16 AM