Irrigation Department: హైదరాబాద్, సంగారెడ్డి సీఈ బదిలీ
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:03 AM
నీటిపారుదల శాఖ హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల చీఫ్ ఇంజనీర్ (సీఈ)ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేసింది.

ఈఎన్సీకి అటాచ్ చేస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల చీఫ్ ఇంజనీర్ (సీఈ)ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేసింది. ఆయన్ను ఈఎన్సీ (జనరల్) కార్యాలయానికి అటాచ్ చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ ఓ ఏఈఈకి చెందిన రూ.100 కోట్ల అక్రమాస్తుల్లో వాటా ఉందన్న ఆరోపణలు రావడంతో సీఈపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సాగునీటి శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) అందించడంలో సదరు ఏఈఈ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News