Inter Supplementary: ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 30 , 2025 | 04:52 AM
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 892 పరీక్షా కేంద్రాల్లో 413597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 892 పరీక్షా కేంద్రాల్లో 413597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అందించే పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్స్ దరఖాస్తు గడువును పొడిగించారు. గతేడాది సెప్టెంబరు-1 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 31తో ముగియనుంది. దీనిని జూన్-30 వరకు పొడిగిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1188120 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. గురువారం వరకు 1075041 దరఖాస్తులు అందాయని, ఇంకా 113079 మందికి అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News