Miss World: మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్ తేనీటి విందు
ABN , Publish Date - Jun 02 , 2025 | 07:30 PM
మిస్ వరల్డ్ విజేతలకు రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్తో పాటు..

ఇంటర్నెట్ డెస్క్: మిస్ వరల్డ్ విజేతలకు రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
రాజ్ భవన్లో జరుగుతోన్న టీ పార్టీకి 72వ మిస్ వరల్డ్ విజేత థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాతా చుయాంగ్ శ్రీ తోపాటు ఆఫ్రికా కాంటినెంటల్ విజేత ఈథియోపియా హస్సెట్ దేరేజే (Hasset Dereje), యూరప్ కాంటినెంటల్ మిస్ పోలాండ్ మజ క్లాజ్డా (Maja Klajda), అమెరికన్-కరీబియన్ కాంటినెంటల్ విజేత ఆరెల్ల జోఅచ్ఛిమ్ (Aurélie Joachim )లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించబోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వెన్నుపోటుకు.. గొడ్డలి వేట్టుకు పేటెంట్
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest AndhraPradesh News And Telugu News