Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్!
ABN , Publish Date - May 08 , 2025 | 03:55 AM
ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి విముక్తి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆమె పాత్రపై మరోసారి సమగ్ర విచారణ అవసరమని తేల్చిం ది.

ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమన్న ధర్మాసనం
తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం
ఆమె పాత్రపై 3 నెలల్లో తేల్చాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి విముక్తి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆమె పాత్రపై మరోసారి సమగ్ర విచారణ అవసరమని తేల్చిం ది. 3నెలల్లో విచారణ జరిపి.. ఆమె పాత్ర ఉందో లేదో తేల్చాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసు లో ఏ-6గా ఉన్న శ్రీలక్ష్మిపై కేసు ను 2022లోనే తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
మంగళవారం కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు.. మిగిలిన నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. అయితే శ్రీలక్ష్మిని డిశ్చార్జి చేయడంపై 2023 ఆగస్టు 3న సీబీఐ సుప్రీంలో సవాల్ చేసింది. ఆ పిటిషన్పై బుధవారం ధర్మాసనం విచారించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం..పై విధంగా ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News