TGSRTC: సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు.. టిక్కెట్ ధర ఎంతంటే..
ABN , Publish Date - May 15 , 2025 | 12:05 PM
సరస్వతి పుష్కరాలకు గ్రేటర్ హైదరాబాద్లోని నిర్ణిత ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని గండిమైసమ్మ, అపురూపకాలనీ, జగద్గిరిగుట్ట ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు.

- జీడిమెట్ల డీఎం ఆంజనేయులు
హైదరాబాద్: జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు జీడిమెట్ల డిపో మేనేజర్ ఆంజనేయులు(Anjaneyulu) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే పుష్కరాలకు గండిమైసమ్మ, అపురూపకాలనీ, జగద్గిరిగుట్ట(Gandimaisamma, Apoorva Colony, Jagadgirigutta) నుంచి స్పెషల్ మెట్రోడీలక్స్ బస్సులు నడుస్తాయన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: వీడు మామూలోడు కాదు.. రెండు రాష్ట్రాల్లో 90 ఇళ్లలో..
టికెట్ ధర పెద్దలకు రూ. 820లు, చిన్న పిల్లలకు రూ. 420లు అని తెలిపారు. కాలనీల నుంచి 35 నుంచి 40 మంది లేదా 20 నుంచి 10 మంది గ్రూప్లు పుస్కరాలకు వెళ్లే భక్తులు 9959226150, 7382817481 నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇస్తే వారి కాలనీకే బస్సు పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని జీడిమెట్ల డిపో పరిసర ప్రాంతాల ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ఆంజనేయులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు
కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం
High Court: ‘దోస్త్’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Read Latest Telangana News and National News