Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి వీక్లీ స్పెషల్ రైళ్లు
ABN , Publish Date - May 24 , 2025 | 06:48 AM
జూన్ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. విశాఖపట్నం-చర్లపల్లి, తిరుపతి-విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాల నుంచి జూన్ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్ రైళ్ల(Summer Weekly Special Trains)ను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. జూన్ 1నుంచి 29 వరకు(ఆదివారం) విశాఖపట్నం-ఎస్ఎంవీటీ బెంగళూరు (08581) ఐదు రైళ్లు, జూన్ 2నుంచి 30వరకు (సోమ) ఎస్ఎంవీటీ బెంగళూరు- విశాఖపట్నం(Bangalore - Visakhapatnam) (08582)ఐదు రైళ్లు,
జూన్ 4నుంచి జూలై 30వరకు(బుధ) విశాఖపట్నం-తిరుపతి (08547) 9 రైళ్లు, జూన్ 5నుంచి జూలై 31 వరకు (గురు) తిరుపతి-విశాఖపట్నం(08548)9 రైళ్లు, జూన్ 6నుంచి జూలై 25 వరకు (శుక్ర) విశాఖపట్నం-చర్లపల్లి(08579), 8 రైళ్లు, జూన్ 7నుంచి జూలై 26వరకు (శని) చర్లపల్లి-విశాఖపట్నం(Cherlapalli-Visakhapatnam)(08580) 8 రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!
Read Latest Telangana News and National News