Phone Tapping Case: మరికొన్ని గంటల్లో యూఎస్ నుంచి హైదరాబాద్కు ప్రభాకర్ రావు
ABN , Publish Date - Jun 06 , 2025 | 09:41 PM
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని అసమ్మతి నేతల ఫోన్లను సైతం ట్యాప్ చేసింది. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా నడిచింది.

హైదరాబాద్, జూన్ 06: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావుకు ఎమర్జన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ శుక్రవారం ప్రభాకర్ రావుకు ఈ ఎమర్జన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఇండియాకు ప్రభాకర్ రావు బయలుదేరనున్నారు. జూన్ 8వ తేదీ అర్థరాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకోనున్నారు. దాంతో జూన్ 9వ తేదీ ఉదయం సిట్ అధికారుల విచారణకు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారిగా ఉన్న సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని అసమ్మతి నేతల ఫోన్లను సైతం ట్యాప్ చేసింది. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా నడిచింది. అయితే 2023 ఏడాది చివరల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. అందులోభాగంగా పలువురు పోలీస్ ఉన్నతాధికారులను సిట్ అధికారు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో అందరు.. ప్రభాకర్ రావు పేరు పేర్కొనడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిట్ సమాయత్తమైంది.
కానీ అప్పటికే విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఆయనను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. మరోవైపు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా.. తనను లక్ష్యంగా చేసుకొని నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారని కోర్టుకు తెిలిపారు. ఈ నేపథ్యంలో తాను ఏపీకి వస్తే వెంటనే అరెస్ట్ చేస్తారని తన పిటిషన్లో స్పష్టంచేశారు. అంతేకాదు తనను ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఆయన సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈ విచారణకు హాజరై.. సిట్ దర్యాప్తు అధికారులకు సహకరిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో సిట్ అధికారులకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు క్లియర్ కట్గా స్పష్టం చేసింది. అయితే ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ అప్పటికే రద్దు కావడంతో .. ఆయనకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించింది. ఈ వీసా జారీ అయిన మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. ఇక ప్రతి ఏటా డీఎస్సీ..
త్వరలో బనకచర్లకు టెండర్ల ఆహ్వానం: సీఎం చంద్రబాబు
For Telangana News And Telugu News