Share News

Medchal: నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌లో ప్రమాదం.. ముగ్గురి మృతి

ABN , Publish Date - May 08 , 2025 | 04:38 AM

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులోని నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది.

Medchal: నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌లో ప్రమాదం.. ముగ్గురి మృతి

బిట్స్‌పిలానీ, మే 7 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులోని నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌ నిర్మాణంలో భాగంగా చిమ్నీలో పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు.. జూల (తాడు) తెగిపోవడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు.


జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే రెండో దశ ప్లాంట్‌ పనులు జరుగుతున్నాయి. 24 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ చిమ్నీలో యూపీకి చెందిన యువ కార్మికులు ప్రకాష్‌(24), సురేశ్‌(21), ఉత్తరాఖండ్‌కు చెందిన అమృత్‌రాయ్‌(20) రిఫ్రాక్టరీ టైల్స్‌ అమరుస్తున్నారు. ఈ క్రమంలో జూల తెగిపోవడంతో 30 అడుగుల ఎత్తు నుంచి వారు ముగ్గురూ కింద ఉన్న యంత్రాలు, స్టీల్‌ సామగ్రిపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:38 AM