అత్యాధునిక వసతులతో.. యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు
ABN , Publish Date - May 31 , 2025 | 04:39 AM
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటుకు పూనుకుందని సీఎంవో కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి) : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటుకు పూనుకుందని సీఎంవో కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 600 ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ప్రైవేటు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, వీటిని అత్యాధునిక వసతులతో కూడిన ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా వసతులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలు, ప్రతి పాఠశాలలో 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏ నిర్మాణంతో పోల్చినా ప్రస్తుతం ఈ పాఠశాలలకు నిర్ణయించిన ధర తక్కువేనని సీఎంవో కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.