Kodandaram: ‘ప్రైవేట్’ ఫీజుల నియంత్రణకు చట్టం: కోదండ
ABN , Publish Date - May 20 , 2025 | 04:33 AM
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని, ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

పంజాగుట్ట, మే19 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని, ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, నెట్వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, దళిత బహుజన ఫ్రంట్, ఎంవీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఫీజుల నియంత్రణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గత ప్రభుత్వం వినేది కాదని.. ఈ ప్రభుత్వం మాత్రం వింటుందన్నారు. ఫీ‘జులుం’ను అరికట్టాలని, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.