Share News

Factory Accident Worker Tragedy: ‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం

ABN , Publish Date - Jul 24 , 2025 | 02:40 AM

పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది.

Factory Accident Worker Tragedy: ‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం

  • మొదటి విడతలో 15 కుటుంబాలకు అందజేత

  • సిగాచి పరిశ్రమ సీఈవో, ఎండీ అమిత్‌రాజ్‌ సిన్హా

పటాన్‌చెరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది. బుధవారం తొలి విడతలో 15 కుటుంబాలకు రాష్ట్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ సమక్షంలో నగదును బదిలీ చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన 46 మంది కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పరిశ్రమ సీఈవో, ఎండీ అమిత్‌రాజ్‌ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.


మిగతా మృతుల కుటుంబాలకు కూడా దశలవారీగా మధ్యంతర పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మరో 8 మంది కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం అందజేస్తామని తెలిపారు. మొదటి విడతలో మొత్తం రూ.5.80 కోట్ల మధ్యంతర పరిహారం అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి పరిహారాన్ని త్వరలోనే అందిస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 02:40 AM