Asaduddin Owaisi: పాక్ ఆట కట్టించేందుకిదే సరైన తరుణం: ఒవైసీ
ABN , Publish Date - May 18 , 2025 | 03:59 AM
పాక్ ఆట కట్టించడంతోపాటు కశ్మీరీలను అక్కున చేర్చుకోవాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రానికి సలహా ఇచ్చారు. పాక్ అంతు చూసేందుకు భారత్కు ఇదే సరైన తరుణమని ఒవైసీ చెప్పారు.

న్యూఢిల్లీ, మే 17: పాక్ ఆట కట్టించడంతోపాటు కశ్మీరీలను అక్కున చేర్చుకోవాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రానికి సలహా ఇచ్చారు. పాక్ అంతు చూసేందుకు భారత్కు ఇదే సరైన తరుణమని ఒవైసీ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కశ్మీరీల మానవ హక్కులను పరిరక్షించాలని, దేశంలో ఎక్కడ కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరక్కుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కోరారు. పాక్కన్నా ఎక్కువగా భారత్లో 20 కోట్ల మంది ముస్లింలున్నారని టర్కీకి గుర్తు చేశారు. భారత్తో టర్కీకి ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా పాక్కు మద్దతుపై పునరాలోచించుకోవాలన్నారు.
ప్రపంచ దేశాలకు పాక్ ఉగ్ర కుట్రలను వివరించడానికి కేంద్రం ఎంపిక చేసిన 7 అఖిలపక్ష ఎంపీ బృందాల్లో సభ్యుడిగా ఉన్న ఒవైసీ.. ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ డెన్మార్క్ తదితర దేశాల నేతలకు పాకిస్థాన్ వక్రబుద్థిని, దొంగ నాటకాలను తెలుపుతామని ఒవైసీ చెప్పారు. పార్టీ పరంగా బీజేపీతో విభేదిస్తామని ఉగ్రవాదులు దేశ ప్రజలను ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. భారతీయులంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని, పడవకు ఎవరు చిల్లుచేసినా అంతా మునిగిపోతామన్న ఒవైసీ.. ఎలాంటి ఆటుపోట్లైనా ఐకమత్యంతో ఎదుర్కొంటామన్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News