Hyderabad: మలక్పేట్ మార్కెట్కు పోటెత్తిన ఉల్లి..
ABN , Publish Date - Jun 03 , 2025 | 10:44 AM
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి రికార్డు స్థాయిలో మలక్పేట్ వ్యవసాయ మార్కెట్కు తరలివచ్చింది. మార్కెట్కు ఇంత పెద్దఎత్తున తరలి రావడం ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రాల్లో ఉల్లి పంట విస్తారంగా సాగవడంతో ఇక్కడి వ్యాపారులు ఉల్లిని దిగుమతి చేసుకున్నారు.

- ఒక్కరోజే రికార్డు స్థాయిలో 40 వేల బస్తాలు రాక
హైదరాబాద్: మలక్పేట(Malakpet) వ్యవసాయ మార్కెట్కు ఉల్లిగడ్డ(Onions) పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 40 వేల బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఆరుమాసాల్లో ఈస్థాయిలో ఉల్లి ఎప్పుడూ రాలేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర నుంచి 105 లారీలు, కర్ణాటక(Karnataka) నుంచి 36 లారీల సరుకు వచ్చిందన్నారు. పెద్దసైజు ఉల్లి మొదటి రకం క్వింటా రూ.1800, మీడియం సైజు రూ.1600, చిన్నరకం ఉల్లి రూ.1400 పలుకుతోందని అధికారులు తెలిపారు. కాగా, మలక్పేట వ్యవసాయ మార్కెట్(Malakpet Agricultural Market)లో ఉల్లి విక్రయాలు సంవత్సరం పొడవునా కొనసాగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే
రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి
Read Latest Telangana News and National News