Phone Tapping Case: ఫోన్ట్యాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:05 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ఫిక్సింగ్ జరిగిందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ తెలిపారు. విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు వచ్చినా ఒరిగేదేమి ఉండదని స్పష్టం చేశారు.

ప్రభాకర్రావు వచ్చినా ఒరిగేదేం లేదు
కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది
ప్రభుత్వం రక్షణ కల్పిస్తే అన్ని అంశాలు బయటపెడతా
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్
నేడు సిట్ ముందుకు ప్రభాకర్రావు!
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ఫిక్సింగ్ జరిగిందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ తెలిపారు. విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు వచ్చినా ఒరిగేదేమి ఉండదని స్పష్టం చేశారు. తనంతట తానే ఫోన్ ట్యాపింగ్ చేయించానని ప్రభాకర్రావు అంగీకరిస్తే కేసు ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. ఇక, కేసీఆర్ అంశం ఎక్కడా ప్రస్తావనకు రాదని స్పష్టం చేశారు. నందకుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు చెబితేనే నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ చేశామని ఈ కేసులో అరెస్టు అయిన రాధాకిషన్రావు ఇప్పటికే నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ చేయకపోతే తనకు సంబంధించిన ఆడియోలు మాజీ సీఎం కేసీఆర్కు ఎలా దొరికాయని ప్రశ్నించారు. తాను రోహిత్రెడ్డితో మాట్లాడింది కాల్ రికార్డింగ్ కావచ్చని, స్వామి సింహయాజీతో మాట్లాడిన కాల్స్ కూడా రికార్డింగేనా? అని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పిస్తే కీలక విషయాలు బయటపెడతానని అన్నారు.
నేడు సిట్ ముందుకు ప్రభాకర్రావు!
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు గురువారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నట్లు తెలిసింది. అమెరికా నుంచి బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకోవచ్చని సమాచారం. ఒక వేళ ఆయన రాక ఆలస్యమైతే మరుసటి రోజున న్యాయవాదులతో కలిసి సిట్ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటి కే ప్రభాకర్రావు భార్య హైదరాబాద్ చేరుకున్నట్లు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి