Share News

MP R. Krishnaiah: గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి..

ABN , Publish Date - Jul 15 , 2025 | 09:36 AM

బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌ సంక్షేమ భవన్‌ ముందు పలువురు గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు.

 MP R. Krishnaiah: గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి..

- ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్: బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌ సంక్షేమ భవన్‌ ముందు పలువురు గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలలకు అదనంగా 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


city5.2.jpg

పాత గురుకులలో వసతి సౌకర్యం ఉన్నచోట 5 నుంచి 8వ తరగతులలో అదనపు సెక్షన్‌లను ప్రారంభించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ గురుకుల సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జి.అంజి, బి. వెంకట్‌, అరవింద్‌స్వామి, శివ, కౌషిక్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెండింగ్‌ ఫీజు బకాయిలు రూ.6వేల కోట్లు విడుదల చేయాలని కోరుతూ సీఎస్‌ రామకృష్ణరావుకు కృష్ణయ్య వినతి ప్రతం అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2025 | 09:36 AM