కవిత వల్లే బీఆర్ఎస్, ఆప్ ఖతం: మల్లు రవి
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:46 AM
అవినీతికి పరాకాష్ఠ కవిత అని, ఆమె ఘనకార్యం వల్లనే బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఖతమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): అవినీతికి పరాకాష్ఠ కవిత అని, ఆమె ఘనకార్యం వల్లనే బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఖతమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా జైలుకెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె నీతులు చెప్పే అర్హత లేదన్నారు. అధికారం కోసం సొంత కూతురి ఫోన్నూ ట్యాప్ చేయించిన నీచ చరిత్ర గత పాలకులదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు.
ముందు ఫోన్ ట్యాపింగ్ వంటి తప్పుడు పనులు చేయించిన వారిని చెప్పుతో కొట్టిన తర్వాత.. తమపై విమర్శలు చేస్తే బాగుంటుందంటూ కవితకు హితవు పలికారు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రజల్ని చంపే హక్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు.