MLC: గిరిజన జాతి మరింత జాగృతం కావాలి..
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:52 PM
గిరిజన జాతి మరింత జాగృతం కావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 1961లో నాటి జనాభా గణన సందర్భంగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులో ప్రొఫెసర్ జాటోత్ రాజారాం, ఆంగ్లంలో ముదావత్ రామునాయక్ అనువదించారు.

- ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: గిరిజన జాతి మరింత జాగృతం కావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram) అన్నారు. 1961లో నాటి జనాభా గణన సందర్భంగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులో ప్రొఫెసర్ జాటోత్ రాజారాం, ఆంగ్లంలో ముదావత్ రామునాయక్ అనువదించారు. ‘1961లో బంజారా గిరిజనుల జీవనం’ పుస్తకాన్ని బుధవారం ప్రెస్క్లబ్లో ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఆవిష్కరించి మాట్లాడారు.
గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు 1961లో బంజారా గిరిజనుల జీవనం పుస్తకం ఎంతో దోహదపడుతుందన్నారు. బంజారాల జీవితాన్ని ప్రతిబింబించే ఆనాటి గిరిజనుల జీవన స్థితిగతులపై రూపొందించిన ఆంగ్ల మోనోగ్రాఫ్ ను నేటితరాలకు ఉపయోగపడేలా తెలుగులో అనువదించడం అభినందనీయ మన్నారు. గిరిజన జాతి జాగృతం కోసం ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాల్సిన అవసరం ఉందన్నారు.
పుస్తక ప్రతులను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని, అప్పుడు బంజారా గిరిజనుల జీవనం, వారి సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలుస్తాయని అన్నారు. కార్యక్రమానికి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధి డి.ఎస్.ఎస్.ఆర్. కృష్ణ అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన అధ్యక్షుడు అంగోత్ రాంబాబునాయక్, ప్రేమ్చంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్న్యూస్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
Read Latest Telangana News and National News