కేటీఆర్, కౌశిక్రెడ్డిలపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:46 AM
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం

గన్పార్క్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ ఏసీపీ, ఎస్హెచ్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, కౌశిక్రెడ్డిలు సీఎం హోదాను విస్మరించి రేవంత్రెడ్డిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో కేసీఆర్ అనేకసార్లు ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం పదవికి గౌరవం ఇవ్వాలనే వారని కేటీఆర్, కౌశిక్రెడ్డిలకు కనీసం సోయిలేకుండా రేవంత్రెడ్డిపై మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.