Share News

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

ABN , Publish Date - May 18 , 2025 | 04:55 AM

నేత కార్మికుడిగా నెలలో పూర్తిగా పని లేక, భార్యా కూతుళ్లకు అనారోగ్యంతో శస్త్ర చికిత్సల కోసం అప్పులు చేసిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

  • పని దొరక్క, అనారోగ్యంతో అప్పుల పాలు

  • స్థానికుల విరాళాలతో అంత్యక్రియలు

సిరిసిల్ల క్రైం, మే 17 (ఆంధ్రజ్యోతి): నేత కార్మికుడిగా నెలలో పూర్తిగా పని లేక, భార్యా కూతుళ్లకు అనారోగ్యంతో శస్త్ర చికిత్సల కోసం అప్పులు చేసిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సాయినగర్‌ వాసి మేరుగు సాగర్‌ (38) తన భార్య అస్మితకు నాలుగు శస్త్ర చికిత్సలు, కూతురు మధుప్రియ కిడ్నీల్లో రాళ్ల తొలగింపు శస్త్ర చికిత్స కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. నెలలో 15-20 రోజులే పని ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.


దీంతో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నప్పుడు సాగర్‌ ఉరేసుకున్నాడు. అర్థరాత్రి దాటాక ఈ సంగతి గమనించిన భార్య అస్మిత.. ఇరుగు పొరుగు వారికి, బంధువులకు సమాచారం అందించారు. శనివారం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం తర్వాత ఇంటి యజమాని.. మృతదేహాన్ని ఇంట్లోకి తేవడానికి అనుమతించలేదు. దీంతో నెహ్రూ నగర్‌లోని ఓ కమ్యూనిటీ హాలులో మృతదేహాన్ని ఉంచి.. స్థానికుల విరాళాలతో అంత్య క్రియలు పూర్తి చేశారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 04:55 AM