Miss World 2025: మహబూబ్ నగర్: పిల్లలమర్రికి అందాల భామలు..
ABN , Publish Date - May 16 , 2025 | 09:26 AM
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం పాలమూరు పర్యటనకు రానున్నారు. అక్కడ 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని సందర్శిస్తారు. అక్కడ 2 గంటల పాటు గడపనున్నారు.

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల (Miss World Contestants) కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు తెలంగాణ (Telangana)లో పర్యటన (Visit)లో భాగంగా శుక్రవారం సాయంత్రం పాలమూరు (Palamuru) పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ పిల్లలమర్రి (Pillalamarri)ని సందర్శిస్తారు. 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పిల్లలమర్రి పరిసరాల్లో సందడి చేయనున్నారు. ముందుగా 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అనంతరం పురావస్తు మ్యూజియంను సందర్శిస్తారు.
గురుకుల పాఠశాలల విద్యార్థులతో ముఖాముఖి..
తర్వాత పిల్లలమర్రి మహావృక్షం కింద గురుకుల పాఠశాలల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు ఆంక్షలు విధించారు. 13 వందల మంది పోలీసులతో మూడంచల బందోబస్తు ఏర్పాటు చేశారు. అందాల భామలకు స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.
Also Read: తుస్ మన్న తుర్కియా డ్రోన్లు, చైనా ఆయుధాలు
750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి..
పాలమూరు సమీపంలోని పిల్లలమర్రికి 750 ఏళ్ల చరిత్ర ఉంది. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం ప్రపంచ గుర్తింపు పొందింది. సుందరీమణులు హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటారు. 2 గంటల పాటు అక్కడ గడపనున్నారు. రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర-సంస్కృతి ఆనవాళ్లు, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను సందర్శించనున్నారు.
ఎకో పార్కుకు సుందరీమణులు...
రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలం, ప్రొద్దుటూరుకు శుక్రవారం మరికొందరు ప్రపంచ అందగత్తెలు రానున్నారు. ఎక్స్పీరియం ఎకో ప్రెండ్లీ పార్కులో సందడి చేయనున్నారు. పార్కులోని ప్రకృతి అందాలను తిలకించనున్నారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు పార్కులో గడపనున్నారు. ఈ సందర్భంగా పార్కులోని వివిధ జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతలను నిర్వాహకులు వారికి వివరించనున్నారు. కాగా, మిస్వరల్డ్ పోటీదారులు ఆదివారం సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 వరకు అక్కడే ఉంటారు. సచివాలయంపై ప్రదర్శించే 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్లో తెలంగాణ చరిత్ర, అభివృద్ధిని వీక్షిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో శుక్ర , శనివారం భారీ వర్షాలు
For More AP News and Telugu News