అడ్డంకులు కల్పించినా సభ సక్సెస్: కేటీఆర్, హరీశ్
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:02 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సభను సక్సెస్ చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆదివారం ఎక్స్ వేదిక ద్వారావారు ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ వచ్చి నిలదీస్తడు అనగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టి అడుగడుగునా ఆటంకాలు కల్పించిందని హరీశ్ రావు అన్నారు. పది, పదిహేను కిలోమీటర్లు కాలినడకన నడిచి సభాస్థలికి రావాల్సిన పరిస్థితి కల్పించారని, అయినా లక్షల మంది హాజరై సభను విజయవంతం చేశారని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News