Share News

బేగంపేట కిమ్స్‌-సన్‌షైన్‌ ఆస్పత్రిలో ప్రపంచంలోనే తొలి ఏఆర్‌ఆధారిత ఓపీడీ

ABN , Publish Date - Jun 05 , 2025 | 04:04 AM

వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే కిమ్స్‌-సన్‌ సైన్‌ హాస్పిటల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.

బేగంపేట కిమ్స్‌-సన్‌షైన్‌ ఆస్పత్రిలో ప్రపంచంలోనే తొలి ఏఆర్‌ఆధారిత ఓపీడీ

  • దక్షిణ కొరియాకుచెందిన ‘స్కియా’తో కలిసి ఏర్పాటు

  • ఇది గేమ్‌ చేంజర్‌ టెక్నాలజీ: డాక్టర్‌ ఏ.వి.గురవారెడ్డి

బేగంపేట, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే కిమ్స్‌-సన్‌ సైన్‌ హాస్పిటల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే తొలి ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఔట్‌పేషెంట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ.. శస్త్రచికిత్స చేసేముందు, ఔట్‌పేషెంట్‌ విభాగాల్లో (ఓపీడీ).. రోగులకు వారి అనారోగ్యం గురించి వివరంగా అర్థమయ్యేలా చెప్పేందుకు ఉపకరిస్తుందని ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి తెలిపారు. బుధవారం ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వైద్య ఆవిష్కరణల సంస్థ స్కియాతో కలిసి ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. దీన్నో గేమ్‌ చేంజర్‌ టెక్నాలజీగా అభివర్ణించారు. దీని ద్వారా రోగులు తమ ఆరోగ్య పరిస్థితులలను 3డీలో వీక్షించగలుగుతారని.. జీర్ణాశయ సంబంధిత సమస్యలు, పిత్తాశయం, పేగు సంబంధిత వ్యాధుల గురించి వారికి స్పష్టమైన అవగాహన కలుగుతుందని చెప్పారు. ఇక.. చదువులేని వారు, మారుమూల గ్రామాల వారికీ సులభంగా అర్ధమయ్యేలా ఏఆర్‌ ఆధారిత ఓపీడీ ప్రిస్ర్కిప్షన్‌ ఉంటుందని డాక్టర్‌ విమలాకర్‌రెడ్డి, డాక్టర్‌ రోహన్‌రెడ్డి తెలిపారు. మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ తదితర విభాగాల ఓపీడీల్లో ఈ సేవలను అందించనున్నట్టు చెప్పారు.


శ్రీశైలం డ్యాంలో రెండో రోజూ శాస్త్రవేత్తల సర్వే

నంద్యాల, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో కట్టడాల తీరుతెన్నులపై పుణేకు చెందిన కేంద్ర జల-విద్యుత్‌ పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు రెండో రోజు బుధవారం కూడా సర్వే చేశారు. శాస్త్రవేత్తలు ఎం.ఎస్‌ బిస్త్‌, అజయ్‌ సొనావనే, వీఎన్‌ కట్టే, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ రాకీ పలు అంశాలపై అధ్యయనం చేశారు. ప్లంజ్‌పూల్‌తో పాటు కాంక్రీట్‌ సిలిండర్ల గ్యాలరీలను పరిశీలించారు. డ్యాంలోని కొన్ని ప్రాంతాలకు బోట్లలో వెళ్లారు. లేజర్‌ టెక్నాలజీతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేశారు. గోతులను పూడ్చడం.. మరమ్మత్తులు చేయడం తదితర అంశాల పరంగా నివేదికను సిద్ధం చేస్తున్నారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 04:04 AM