Deputy CM Bhatti Vikramarka: ప్రభుత్వం రైతాంగానికి అండ..
ABN , Publish Date - May 29 , 2025 | 01:17 PM
Deputy CM Bhatti Vikramarka: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒకేసారి 3,500 కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఖమ్మం జిల్లా: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో రైతులు (Farmers) ఈ ఏడాది ధాన్యం పండించారని, 65 మెట్రిక్ టన్నుల ధాన్యం (65 Metric Tonnes Paddy) రైతాంగం పండించారని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా (Khammam)లో డిప్యూటీ సీఎంతోపాటు ఇన్చార్జ్ మంత్రులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడిందని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి వారం రోజుల్లలో వారి ఎకౌంట్లలో డబ్బులు వేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయమని, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని భట్టి విక్రమార్క అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు..
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒకేసారి 3,500 కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నిరంతరం ఇళ్ల మంజూరు ప్రక్రియ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేదలతో ఆడుకున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో నాలుగు లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేసి పేదలకు అందజేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలన్నారు. చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
Also Read: 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: లంకా దినకర్
ఇదో మహాత్తర కార్యక్రమం..
ఇదోక మహాత్తర కార్యక్రమం అని, ఇంత గొప్ప కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేదలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రైతన్నకు విత్తనాలు అందజేసే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, నకిలీ విత్తనాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో రైతాంగానికి, ప్రజలకు హామీ ఇచ్చామని, గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిని రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పామన్నారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ధరణిని రద్దుచేసి ఆనాదిగా వస్తున్న దుర్మార్గపు చట్టాలను తొలగించి సరికొత్త భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామన్నారు. జూన్ 2న ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఇది ప్రజా ప్రభుత్వం.. మంత్రి పొంగులేటి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇన్చార్జి మంత్రులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీజనల్ వ్యాధుల దగ్గర నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు ప్రతి ఒక్క అంశంపై చర్చ జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నామన్నారు. రైతాంగానికి ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగడానికి వీల్లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ..
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో ముందు ఉందని అన్నారు.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు వర్చ్యువల్ మంత్రులు..
ఖమ్మం జిల్లాకు ముగ్గురు వర్చ్యువల్ మంత్రులున్నారని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబోతున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంట రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రులలో వైద్య సేవలు మెరుగుపరిచి పేదలకు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెప్పారు. కార్పొరేటర్ స్థాయిలో పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెరిగిందని, మాత శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ సిక్కిం పర్యటన రద్దు
For More AP News and Telugu News