KTR Supports Indian Army: ఇండియన్ ఆర్మీకి అండగా ఉందాం
ABN , Publish Date - May 09 , 2025 | 02:48 PM
KTR Supports Indian Army: పాకిస్థాన్తో భారతదేశం పోరాడుతోందని.. ఇండియన్ ఆర్మీకి అండగా నిలుద్దామని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఖమ్మం, మే 9: భారత్ - పాకిస్థాన్ యుద్ధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) స్పందించారు. పాకిస్థాన్తో భారతదేశం పోరాడుతోందన్నారు. ఇండియన్ ఆర్మీ విరోచితంగా పోరాడుతున్నారని కొనియాడారు. భారత సైన్యానికి మద్దతుగా అండగా నిలుద్దామని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు (శుక్రవారం) జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ దివంగత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తల్లాడ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... మాజీ డీసీఎంఎస్ రాయల శేషగిరిరావు ఘనంగా నివాళులర్పించారు. శేషగిరి రావు రైతుల కోసం పోరాడారని గుర్తుచేశారు.
ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు వచ్చాయని.. కానీ జిల్లాకు జరిగిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం.. ఎన్నికలలో గెలవటానికి అఫిడవిట్లు రాసి, బాండ్లు రాసి ప్రమాణాలు చేశారని.. ఆ ప్రమాణాలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ అమలు జరిపిన పధకాలన్నీ ఎత్తేశారని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేయలేక పోయారని విమర్శించారు. ఆడబిడ్డలకు డబ్బులు, తులం బంగారం అన్నారు ఏది ఏమైందని అడిగారు. ఇప్పుడు బాగుందా మార్పు అని అడిగారు. ఖమ్మం జిల్లాలో మార్పు మార్పు అని కాంగ్రెస్కు గుద్దారు ఇప్పుడు ఏమైంది.. ఎక్కడ మార్పు అని నిలదీశారు. ‘మీకు కొద్దిగా మాపై బోర్ కొట్టింది. వాళ్లకు ఓట్లు వేశారు. ఇప్పుడు ఏమైంది ’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని.. నిలదీసి తీరతామని స్పష్టం చేశారు.
Supreme Court Orders: డిప్యూటీ కలెక్టర్కు డిమోషన్.. సుప్రీం సంచలన తీర్పు
రేవంత్ రెడ్డి అంత నికృష్ట ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. ‘ఢిల్లీలో అపాయింట్మెంట్స్ ఇవ్వటం లేదు. చెప్పులు ఎత్తుకుపోయే వాడిగా, దొంగలా చూస్తున్నారట. దొంగను దొంగలా చూడక ఎలా చూస్తారు’ అంటూ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కూడా ఇటువంటి దుర్మార్గులు వస్తారని ఊహించి ఉండరన్నారు. తొందరలోనే ప్రజలకు మంచి అవకాశం వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని.. తామంతా సీరియస్గా పని చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు అన్నీ గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బహిరంగ సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. సరిహద్దులలో విరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు సెల్యూట్ చేశారు. భారత సైన్యానికి అండగా నిలుద్దామన్నారు. మాజీ డీసీఎంఎస్ రాయల శేషగిరిరావుకు రవిచంద్ర నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News