Police Assault Case: ట్రైనీ ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్.. కారణమిదే
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:44 PM
Police Assault Case: బాధితుడు మహేందర్, మానవహక్కుల సంఘాల నేతల నెలరోజుల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. భార్గవ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. గత నెల (మే)8న సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.

కరీంనగర్, జూన్ 10: జిల్లాలోని సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. గొల్లగోడెంకు చెందిన బొత్తుల మహేందర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Drunk and Drive test) చేసే క్రమంలో పోలీసులు చితకబాదారు. దీంతో మహేందర్కు తీవ్ర గాయాలయ్యాయి. మహేందర్ను పోలీసులు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్, డీజీపీ, ఎస్పీలకు బాధితుడు మహేందర్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు తిప్పారావు, సంపత్ కూడా పలువురికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ట్రైనీ ఎస్సై భార్గవ్ను అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. బాధితుడు మహేందర్, మానవహక్కుల సంఘాల నేతల నెలరోజుల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. భార్గవ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. గత నెల (మే) 8న సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో బాధితుడు మహేందర్ శంకరంపట్నం నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నేపథ్యంలో మహేందర్ వాహనాన్ని ఎస్సై ఆపాడు. ఇంతలో మహేందర్కు ఫోన్ రావడంతో మాట్లాడుతుండగా.. ఎస్సై రెచ్చిపోయాడు. తన ముందే ఫోన్ మాట్లాడుతావా అంటూ బాధితుడిపై చేయి చేసుకున్నాడు. మహేందర్పై ఎస్సై దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్గా మారాయి.
ట్రైనీ ఎస్సై దాడిలో బాధితుడు మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి చెవికి, తలకు గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రిలో కొద్దిరోజుల పాటు చికిత్స పొందాడు. ఈ ఘటనపై ట్రైనీ ఎస్సై సహా ఇతర సిబ్బందిపై డీజీపీకి, కరీంనగర్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మానవహక్కుల సంఘం నేతల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా బాధితుడికి అండగా నిలిచి పోరాడారు. వారి పోరాటం ఫలించి ట్రైనీ ఎస్సై భార్గవ్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎస్సై, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
ఇవి కూడా చదవండి
జడ్జి పేరు చెప్పారు.. డబ్బులు లాగారు.. కేటుగాళ్ల నయా మోసం
రాజా మర్డర్.. వైరల్గా మారిన పెళ్లి వీడియో..
Read Latest Telangana News And Telugu News