Share News

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , Publish Date - May 28 , 2025 | 04:14 AM

జూన్‌ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి జూన్‌ 13వ తేదీ వరకు నిర్వహించనున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 42,832 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 26,286 మంది బాలురు, 16,546 మంది బాలికలు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 150 కేంద్రాలు ఏర్పాటు చేశామని కృష్ణారావు తెలిపారు. హాల్‌ టికెట్లను ఇప్పటికే విడుదల చేశామని, విద్యార్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుంచి పొందవచ్చన్నారు.

Updated Date - May 28 , 2025 | 04:15 AM