JNTU: టీసీఎస్తో జేఎన్టీయూ అవగాహన
ABN , Publish Date - May 09 , 2025 | 08:17 AM
కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) బహుళ జాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. విద్యా, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ కుదిరింది.

- ఐటీ మంత్రి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్న అధికారులు
హైదరాబాద్ సిటీ: బహుళ జాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. విద్యా, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ కుదుర్చుకున్నట్లు జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ టి.కిషన్కుమార్రెడ్డి తెలిపారు. సచివాలయంలోని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ ఎంఓయూ కార్యక్రమంలో టీసీఎస్ ఐయాన్ ప్రతినిధులు స్మృతిమూలే, దేవరకొండ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మిస్ వరల్డ్ పోటీల ‘వీక్షణ’ పాస్లకు అపూర్వ స్పందన
కీలకమైన కార్యక్రమానికి రిజిస్ట్రార్ దూరం
ఎంఓయూ కార్యక్రమానికి జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు హాజరుకాకపోవడం వర్సిటీ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. రిజిస్ట్రార్ యూనివర్సిటీలోనే అందుబాట్లో ఉన్నప్పటికీ కీలకమైన ఎంఓయూ కార్యక్రమానికి ఆయన్ను రమ్మని పిలవకపోవడం పట్ల వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంఓయూ కార్యక్రమానికి దూరంగా ఉండడంపై రిజిస్ట్రార్ను వివరణ కోరగా, తాను వేరొక సమావేశంలో పాల్గొనాల్సి ఉండడంతో ఎంఓయూ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..
ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News