Public Literary Award: జయరాజ్కు దాశరథి ప్రజా సాహిత్య పురస్కారం
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:47 AM
ప్రజా కవి, గాయకుడు జయరాజ్ను దాశరథి ప్రజా సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక ప్రకటించింది.....

దాశరథి శత జయంత్యుత్సవాల వేళ జూలై 20న ప్రదానం
హైదరాబాద్ సిటీ, జూన్29(ఆంధ్రజ్యోతి): ప్రజా కవి, గాయకుడు జయరాజ్ను దాశరథి ప్రజా సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక ప్రకటించింది. దాశరథి శతజయంత్యుత్సవాల సందర్భంగా ఈ అవార్డును జూలై 20న ప్రదానం చేస్తామని నిర్వాహకులు గొర్రెపాటి నరసింహ ప్రసాద్ తెలిపారు. గత ఏడాది ఇదే పురస్కారాన్ని ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అందించారు.