Share News

Ponnam Prabhakar: ఇందిరమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ పాలన!

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:11 AM

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు.. హన్మంతుని గుడి లేని గ్రామం లేదు’ అనే నానుడి గత కాంగ్రెస్‌ హయాంలో ఉండేదని ఇప్పుడు అదే నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Ponnam Prabhakar: ఇందిరమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ పాలన!

  • ‘మంత్రులతో ముఖాముఖి’ మళ్లీ ప్రారంభం

  • ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ’ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు.. హన్మంతుని గుడి లేని గ్రామం లేదు’ అనే నానుడి గత కాంగ్రెస్‌ హయాంలో ఉండేదని ఇప్పుడు అదే నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ చొరవతో ప్రారంభమైన ముఖాముఖి కార్యక్రమం కొన్ని వారాలుగా నిలిచిపోయింది. పార్టీ కార్యకర్తలు, నాయకుల ఒత్తిడితో బుధవారం మంత్రి పొన్నం పునరుద్ధరించారు. కార్యక్రమాన్ని ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పరిశీలించారు.


ఈ సందర్భంగా రాష్ట్రంలో మిగిలిపోయిన 7,404 గ్రామ పరిపాలన అధికారి(జీపీఓ) ఉద్యోగాలను జాబ్‌ క్యాలండర్‌ ద్వారా భర్తీ చేయాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కాగా, బీఆర్‌ఎస్‌లో గొడవలు కేవలం ఉనికి కోసం ఆ పార్టీ ఆడుతున్న డ్రామాలని పొన్నం విమర్శించారు. రాజకీయంగా ప్రజల దృష్టి మళ్లిచేందుకే బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తోందన్నారు. రాజకీయ ఉనికి కోసమే కవత పోరాటం ప్రారంభించిందని, వారి కుటుంబ పంచాయతీ కాంగ్రె్‌సకు అవసరం లేదన్నారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:11 AM