Maganti: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి
ABN , Publish Date - Jun 08 , 2025 | 07:16 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) కన్నుమూశారు (Death). ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు.ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) కన్నుమూశారు (Death). ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు (Heart attack)తో ఏఐజీ ఆస్పత్రి (AIG Hospital)లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
మాగంటి రాజకీయ ప్రస్థానం..
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా పని చేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. మాగంటి గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. 2023లో కూడా ఎన్నికల్లో గెలిచారు.
మాగంటి గోపీనాథ్ తల్లిదండ్రులు.. కృష్ణమూర్తి, మహానంద కుమారి, జీవిత భాగస్వామి సునీత, సంతానం.. మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు). మాగంటి నిర్మాతగా తీసిన సినిమాలు.. పాతబస్తీ (1995), రవన్న (2000), భద్రాద్రి రాముడు (2004), నా స్టైలే వేరు (2009).
కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ను పరామర్శించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి గోపీనాథ్ను పరామర్శించారు.
గురువారం ఛాతీలో నొప్పి రావడంతో మాగంటి గోపీనాథ్ ఇంట్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సీపీఆర్ చేయడంతో కాస్త కోలుకున్నారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే సమయంలో స్పృహ కోల్పోయారు. ఆసుపత్రి వర్గాలు మరోసారి సీపీఆర్ చేయడంతో పల్స్ రేటు పెరిగింది. దీంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. కాగా, కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన సతీమణి శైలిమ గురువారమే ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం కూడా ఆమె ఆసుపత్రికి వెళ్లి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేటీఆర్ కుమారుడు, మాగంటి కుమారుడు హైదరాబాద్లో కలిసి చదువుకోవడం వల్ల రెండు కుటుంబాల మధ్య మైత్రి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
డ్యూటీ టైం ముగిసింది.. విమానం నడపను
For More AP News and Telugu News