CM Revanth Reddy: పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:45 AM
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ గ్రౌండ్ (Parade Grounds)లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day Celebrations) సోమవారం ఘనంగా జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉదయం 10 గంటలకు జాతీయ జెండా (National Flag) ఎగురవేయనున్నారు. 10:40 గంటలకు ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేస్తారు. ఈసారి రాష్ట్ర అవతరణ వేడుకలకు విదేశీ అతిథి హాజరవుతున్నారు. జపాన్లోని కితాక్యూషు నగర మేయర్ కజుహి సా టకేచీ అతిథిగా పాల్గొననున్నారు. ఆయన తన ప్రతినిధి బృందంతో కలసి ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు. వేడుకల అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ ప్రభుత్వం.. కితాక్యుషు నగర ప్రతినిధులు పలు అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇటీవల జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషు నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్కు రావాలని మేయర్ టకేచీని ఆహ్వానించారు.
Also Read: కాళేశ్వరంపై హరీష్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
వేడుకల కార్యక్రమాల వివరాలు..
09:40 గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో పరేడ్కు సిద్ధం
09:45 గంటలకు పరేడ్ కమాండర్ పరేడ్ బాధ్యతలు స్వీకరిస్తారు
09:50 గంటలకు డీజీపీ డాక్టర్ జితేందర్, చేరుకుంటారు..
09:52 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, చేరుకుంటారు.. డీజీపీ, ఆయనను ఆహ్వానిస్తారు..
09:55 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సీఎంకు స్వాగతం పలుకుతారు..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐఏఎస్, అధికారుల పరిచయం
10:00 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు . జాతీయ గీతం ఆలాపన - పోలీసు బ్యాండ్
10:01 గంటలకు తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన.. సీఎం ఎదుట పోలీస్ల కవాతు వందన సమర్పణ
10:04 గంటలకు ముఖ్యమంత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వందన సమర్పణ వేదిక వద్దకు తోడ్కొని వెళతారు.
10:05 గంటలకు పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రికి నివేదన
10:17 గంటలకు ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ జీపులో కవాతును పరిశీలిస్తారు. డీజీపీ పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రితో పాటు వెళతారు
10:17 నుంచి 10:40 గంటల వరకు కంటింజెంట్ల ద్వారా మార్చ్ పాస్ట్
10:40 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం..
11:00 గంటలకు తొమ్మిది మంది ప్రముఖ వ్యక్తులు, కుటుంబ సభ్యులకు నగదు పురస్కారం ప్రదానం.
11:15 గంటలకు పోలీసు సిబ్బందికి అవార్డుల ప్రదానం.. 19 మందికి శౌర్య పతకాలు.. ఇద్దరికి విశిష్ట సేవా పతకాలు, 11మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలు, 11 ఉత్తమ దళాలకు బహుమతుల ప్రదానం.
11:20 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో అవార్డు గ్రహీతల ఫోటో
11:30 గంటలకు ముఖ్యమంత్రి వేదిక నుంచి బయలుదేరివెళతారు..
అలాగే రాష్ట్ర అవతరణ వేడుకల కోసం జిల్లాల వారీగా మంత్రులు, ముఖ్య నాయకులను ప్రభుత్వం ఇంచార్జీలుగా నియమించింది. ఉదయం 10 గంటలకు జిల్లాల్లో మంత్రులు, ముఖ్య నేతలు జాతీయ జెండా ఎగరేయనున్నారు.
1 ఆదిలాబాద్.. షబ్బీర్ అలీ
2. భద్రాద్రి కొత్తగూడెం.. తుమ్మల నాగేశ్వర రావు
3. హనుమకొండ.. కొండా సురేఖ,
4. జగిత్యాల్.. లక్ష్మణ్ కుమార్ విప్
5. జయశంకర్ భూపాలపల్లి, పోడెం వీరయ్య, చైర్మన్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్,
6. జనగామ.. బీర్ల ఇల్లయ్య, విప్
7. జోగులాంబ గద్వాల్.. జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
8. కామారెడ్డి.. పటేల్ రమేష్ రెడ్డి, చైర్మన్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్
9 కరీంనగర్.. డి. శ్రీధర్ బాబు మంత్రి
10. ఖమ్మం.. భట్టి విక్రమార్క మల్లు,
11. కుమురంభీం ఆసిఫాబాద్.. బండ ప్రకాష్, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్,
12. మహాబుబాబాద్..రామ్చందర్ నాయక్, విప్,
13 మహాబుబనగర్.. జూపల్లి కృష్ణ రావు, మంత్రి
14. మంచిర్యాల.. హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ సలహాదారు
15. మెదక్.. కె కేశవరావు అడ్వైజర్
16. మేడ్చల్.. పట్నం మహేందర్ రెడ్డి
17. ములుగు.. సీతక్క, మంత్రి
18. నాగర్ కర్నూల్.. చిన్నారెడ్డి
19. నల్గొండ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
20. నారాయణపేట.. గుర్నాథ్ రెడ్డి
21. నిర్మల్.. సిరిసిల్ల రాజయ్య
22. నిజామాబాద్.. ఎరావత్రి అనిల్
23. పెద్దపల్లి.. నేరెళ్ల శారద
24. రాజన్న సిరిసిల్ల.. ఆది శ్రీనివాస్
25. రంగారెడ్డి.. వేం నరేందర్ రెడ్డి
26. సంగారెడ్డి.. దామోదర రాజనర్సింహ
27. సిద్దిపేట.. పొన్నం ప్రభాకర్
28. సూర్యాపేట.. ఉత్తంకుమార్ రెడ్డి
29. వికారాబాద్.. గడ్డం ప్రసాద్
30. వనపర్తి.. ప్రీతం
31. వరంగల్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
32. యాదాద్రి భువనగిరి.. గుత్తా సుఖేందర్ రెడ్డి..
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్..
ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు
For More AP News and Telugu News