Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 15 , 2025 | 12:05 PM
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్తో సహా అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల కేసు (Land Case)లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు (Key Remarks) చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ (Justice BR Gavai) ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్ (CS)తో సహా అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.
కాగా సీఈసీ దాఖలు చేసిన అఫిడవిట్పై కౌంటర్ వేసేందుకు కొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. దీంతో జులై 23వ తేదీలోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ జులై 23 వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం...
అలాగే విద్యార్ధులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన ఐఏను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. ఆ విషయంలో ప్రత్యేకంగా మరో పిటీషన్ను దాఖలు చేయాలని, ఈ కేసులో కలపకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ.. నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు యధాస్థితి కొనసాగించాలని పేర్కొంది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి ఒప్పుకోమని స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా వందల ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలంది. ఈ క్రమంలో గత విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల గురించి సుప్రీం కోర్టుకు సీఈసీ మధ్యంతర నివేదికను అందజేసింది.
కాగా సీజేఐగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేసు ఇదే. విచారణ ప్రారంభంలోనే వివరాలను పరిశీలించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు తొలగించేందుకు వినియోగించారని, ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా.. లేదా అన్నది స్పష్టం చేయాలన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ అన్నారు. కాగా కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రస్తుతం ఎలాంటి పనులు జరగడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం
అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన
For More AP News and Telugu News