Share News

MLA Raja Singh: ఆనాడే వేరే పార్టీలోకి పోలేదు..

ABN , Publish Date - Jun 12 , 2025 | 09:11 AM

Raja Singh statement: తాను బీజేపీ తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనతో కొంతమంది ఆట ఆడుతున్నారని.. తాను వేరే పార్టీలోకి వెళ్లనన్న విషయం వాళ్లకు తెలుసునని.. అందుకే వాళ్లు తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చుననే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అన్నారు.

MLA Raja Singh: ఆనాడే వేరే పార్టీలోకి పోలేదు..
Raja Singh statement

Hyderabad: గోషామహల్‌ (Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు (Key Comments) చేశారు. కొన్ని చానళ్లలో ఒక వార్త నడుస్తోందని, రాజాసింగ్ వేరే పార్టీలో వెళతారా.. వేరే పార్టీని తీసుకొని వస్తారా.. లేక వేరే పార్టీ పెడతారా అనే వార్తలు వస్తున్నాయని అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాయని.. 14 నెలలు పార్టీకి దూరంగా ఉన్నానని అన్నారు. అప్పుడే తాను వేరే పార్టీలోకి పోలేదని.. వేరే పార్టీని తీసుకొని రాలేదని.. వేరే పార్టీ పెట్టలేదని రాజా సింగ్ చెప్పారు.


వారిని వదిలిపెట్టను...

తాను బీజేపీ తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనతో కొంతమంది ఆట ఆడుతున్నారని.. తాను వేరే పార్టీలోకి వెళ్లనని వాళ్లకు తెలుసునని.. అందుకే వాళ్లు తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చుననే ఆలోచన పెట్టుకున్నారని అన్నారు. ఇవాళ తాను ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లను చూసి బీజేపీలో ఉన్నానని లేకపోతే ఎప్పుడో పార్టీని వీడి వెళ్లిపోయేవాడినని చెప్పారు. తనకు మొదటి పార్టీ టీడీపీ అని, చివరిది భారతీయ జనతా పార్టీ అని.. ఇది తన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. పార్టీని వీడానంటే ఇక తాను రాజకీయాలను వదిలివేస్తాను తప్ప.. వేరే పార్టీలో చేరనని తెలిపారు. పార్టీలో తనను వేధించే వారిని కూడా వదిలిపెట్టనని ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.


కాగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నుంచి కావాల్సిన నిధుల అంశంలో బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెవులు లేని వాళ్లని అడిగితే ఏం లాభం..? చెవులు ఉన్న వాళ్లని అడిగితేనే ఫలితం ఉంటుందని.. సీఎం రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు. ప్రధాని మోదీ మంచి నాయకుడని, సీఎం ప్రధానిని కలిస్తే పనులు జరుగుతాయని సూచించారు. అలాగే, సీఎం రేవంత్‌నుద్దేశించి రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రాష్ట్రంలో నోరు మూసుకుని ఉంటారని, కానీ ఢిల్లీకి వెళ్లిన తర్వాత నోరు ఎత్తుతారని, ఆ సీక్రెట్‌ ఏంటో చెప్పాలని కోరారు. ‘రేవంత్‌రెడ్డి గారు మొన్న మీరు కిషన్‌రెడ్డి ముందే ఉన్నారు కదా.. అప్పుడు కిషన్‌ రెడ్డిని ఎందుకు అడగలేదు.. ఈ రోజు ఢిల్లీలో మీరు ఎందుకని బీజేపీ, కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు?’ అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీని కలిసి విషయాన్ని ఆయన ముందు ఉంచాలని సూచించారు. అలాగే, 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ అభివృద్థికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయనే దానిపై ఓ జాబితాను తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.


ఇవి కూడా చదవండి:

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..

పెరిగిన గోల్డ్, వెండి ధరలు..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 12 , 2025 | 09:11 AM