Raj Bhavan Theft Case: రాజ్భవన్ చోరీ కేసులో మరో మలుపు
ABN , Publish Date - May 20 , 2025 | 11:01 AM
Raj Bhavan Theft Case: రాజ్భవన్ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిని ఒకే వారంలో రెండు సార్లు పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

హైదరాబాద్, మే 20: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజ్భవన్ (Raj Bhavan) చోరీ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి రాజభవన్ ఉద్యోగి భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. రాజ్భవన్లో చోరీ కేసులో నిందితుడిని పంజాగుట్ట పోలీసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు. మార్ఫింగ్ ఫొటో విషయంలో మొదటి సారి అరెస్ట్ చేయగా.. రెండో సారి రాజభవన్లోని హార్డ్ డిస్క్ చోరీ కేసులో నిందితుడిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని మాయ చేసి నైట్ టైంలో ఎంట్రీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ ఉద్యోగి వారంలో రెండు సార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.
ఇదీ విషయం
రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ తన తోటి మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫోటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నాడు జాగ్రత్త అని చెప్పాడు. ఇంకా చాలా ఫోటోలను తన సిస్టంకు కూడా పంపించాడని భయపెట్టాడు. దీంతో కలవరానికి గురైన మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..ఆ మార్ఫింగ్ ఫోటోలను శ్రీనివాస్ పంపించాడని తేల్చారు. దీంతో వెంటనే శ్రీనివాస్ను అరెస్ట్ చేసి వారం కింద రిమాండ్కు పంపారు. ఈ ఘటనతో రాజ్భవన్ అధికారులు శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. జైలుకు వెళ్లిన శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు.
NIA Investigation: ఉగ్ర కుట్రపై రెండో రోజు ఎన్ఐఏ దర్యాప్తు
జైలు నుంచి వచ్చిన అతడు రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్ను చోరీ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులకు రాజభవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. దీంతో శ్రీనివాస్ను పోలీసులు రెండో సారి జైలుకు పంపారు.
ఫైళ్ల మాయంపై ఏసీపీ వివరణ
తొలుత రాజ్భవన్లో జరిగిన చోరీ కీలక హార్డ్ డిస్క్లు, ఫైళ్లు మాయం అయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఫైళ్ల మాయంపై పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ వివరణ ఇచ్చారు. రాజ్ భవన్లో పనిచేసే ఓ మహిళ.. తన ఫోటోలను ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ మార్పింగ్ చేసినట్లు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఈనెల 12న శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని.. ఈ ఘటన తర్వాత శ్రీనివాస్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారన్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ల కోసం శ్రీనివాస్ మళ్ళీ రాజ్ భవన్కు 14న వచ్చాడని.. హెల్మెట్ ధరించి హార్డ్ డిస్క్లను దొంగలించాడన్నారు. దీనిపై దర్యాప్తు చేసి శ్రీనివాస్పై మరో కేసు నమోదు చేశామని.. 15న అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. రాజ్ భవన్లో ఎలాంటి డాక్యుమెంట్లు, ఫైల్స్ చోరీ అవ్వలేదని.. రాజ్ భవన్లో ఎలాంటి బయట వ్యక్తుల చోరీ జరగలేదని ఏసీపీ మోహన్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
JN.1 COVID 19 Variant: కొవిడ్ కేసుల పెరుగుదల.. ఏమిటీ జేఎన్.1 కరోనా వేరియంట్
GHMC: ఆ భవనాల సెల్లార్లు ఎంతవరకు సురక్షితం..
Read Latest Telangana News And Telugu News