Phone Tapping Case: రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:17 PM
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకరరావును సెట్ అధికారులు రెండో రోజు బుధవారం విచారిస్తున్నారు. హార్డ్ డిస్క్లు ధ్వంసంపై విచారణ చేస్తున్నారు. ప్రణీత్ రావు, రాధ కిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లు ముందు పెట్టి అధికారులు విచారణ చేస్తున్నారు.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ (Ex-SIB chief) (ఓఎస్డీ) టి.ప్రభాకర్రావు (Prabhakar Rao) రెండో రోజు (2nd Day) బుధవారం సిట్ విచారణకు (SIT Inquiry) హజరయ్యారు. వ్యక్తిగత సెల్ ఫోన్లను సిట్ దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే హార్డ్ డిస్క్లు, ఎస్ఐబీకి చెందిన కీలక సమాచారాన్ని మాజీ డీఎస్సీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఈ సందర్బంగా మొదటి రోజు (మంగళవారం) హార్డ్ డిస్క్లు ధ్వంసంపై సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ రోజు కూడా సుదీర్ఘంగా విచారణ చేయనున్నారు. ప్రణీత్ రావు, రాధ కిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లు ముందు పెట్టి అధికారులు విచారణ చేస్తున్నారు.
కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్ఫోన్లను తమకు అప్పగించాలని సిట్ అధికారులు ఆదేశించారు.సెల్ఫోన్లతో పాటు ల్యాప్టాప్, మ్యాక్ నోట్బుక్లను సైతం అందజేయాలని సూచించారు. తొలిరోజు విచారణలో ప్రభాకర్రావు విచారణాధికారులకు సరిగ్గా సహకరించక, ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు అరెస్టు అయిన రాధాకిషన్రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నుంచి రిట్రీవ్ చేసిన డాటా ఆధారంగా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా.. కొందరూ న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది.. స్పెషల్ ఆపరేషన్ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు.. అనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి, ప్రశ్నించడానికి సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. కాగా.. ప్రభాకర్రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రభాకర్రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి.. ఈ నెల 20వ తేదీలోపు ప్రభాకర్రావు కోర్టులో హజరుకావాలని ఆదేశించారు. అయితే.. సంబంధింత న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ప్రభాకర్రావు వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి:
ఈ నక్షత్రం చాలా పవిత్రమైన రోజు..
విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..
For More AP News and Telugu News