Malnadu Drugs Case: నైజీరియన్ యువతులతో డ్రగ్స్ దందా..
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:54 PM
Malnadu Drugs Case: డ్రగ్స్ సప్లై , విక్రయాలకు నైజీరియన్ యువతులతో డ్రగ్స్ ముఠా దందా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. నైజీరియా యువతలకు కమీషన్ ఆశ చూపించి డ్రగ్స్ దందా, వ్యభిచారం చేయిస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో విచారణలో వెల్లడైంది.

హైదరాబాద్, జులై 11: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో (Malnadu Drugs Case) కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియా యువతితో మల్నాడ్ కిచెన్ యజమాని సూర్య డ్రగ్స్ దందా చేయించినట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. డ్రగ్స్ చేరవేర్చినందుకు వెయ్యి రూపాయలు, విక్రయించినందుకు రూ.3 వేలు కమిషన్ ఇస్తున్నట్లు విచారణలో తేలింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును నార్కోటిక్ బ్యూరో అధికారులు కోరనున్నారు. సూర్యను విచారిస్తే ఈ కేసులో మరికొన్ని సంచలనమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది.
డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న నైజీరియన్స్ను హెచ్ న్యూ డిపోర్టేషన్ చేస్తోంది. డ్రగ్స్ సప్లై , విక్రయాలకు నైజీరియన్ యువతులను ఉపయోగించుకుని డ్రగ్స్ ముఠా దందా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. నైజీరియా యువతలకు కమీషన్ ఆశ చూపించి డ్రగ్స్ దందా, వ్యభిచారం చేయిస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో విచారణలో వెల్లడైంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీలో 60 మంది నైజీరియా యువతులు ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. రెండేళ్లలో 19 మందిని వారి దేశాలకు తిరిగి పంపించేయగా.. అందులో ఆరుగురు యువతులు ఉన్నట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది.
ఇవి కూడా చదవండి
హెచ్సీఏ స్కామ్.. రంగంలోకి ఈడీ
రాజాసింగ్ రాజీనామా లేఖను ఆమోదించిన జేపీ నడ్డా
Read Latest Telangana News And Telugu News