Crime News: మహిళ గొంతు కోసి.. హత్య.. వీడిన మిస్టరీ..
ABN , Publish Date - May 14 , 2025 | 10:11 AM
Crime News: కూలి పనులు చేసుకుంటూ కేశవగిరిలో నివాసం ఉంటున్న కేతావత్ బుజ్జి అనే మహిళ.. భర్త చనిపోవడంతో.. ఒంటరిగా ఉంటోంది. వెస్ట్ బెంగాల్కు చెందిన మేస్త్రీ జుల్ఫికర్ అలీతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.

హైదరాబాద్: చాంద్రాయణగుట్ట (Chandrayanagutta)లో ఐదు రోజుల క్రితం జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీ (Woman Murder Case Mystery) వీడింది. తనను పెళ్లి (Marriage) చేసుకోవాలని మహిళ ఒత్తిడి చేయడంతోనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు (Police) గుర్తించారు. మహిళ గొంతు కోసి.. హత్య చేసి.. తగులబెట్టాడు.. ఆపై తనకేం తెలియనట్టు బయటకు వచ్చి కేకలు పెట్టాడు. స్థానికులతో కలిసి మంటలు ఆర్పే యత్నం చేశాడు. మహిళ ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
కూలి పనులు చేసుకుంటూ..
కూలి పనులు చేసుకుంటూ కేశవగిరిలో నివాసం ఉంటున్న కేతావత్ బుజ్జి అనే మహిళ.. భర్త రూప్లా చనిపోవడంతో.. ఒంటరిగా ఉంటోంది. వెస్ట్ బెంగాల్కు చెందిన మేస్త్రీ జుల్ఫికర్ అలీతో బుజ్జికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో బుజ్జి ఇంటి పక్కనే అతను అద్దెకు దిగాడు. వివాహం చేసుకోవాలని అతనిపై బుజ్జి ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు జుల్ఫికర్ అలీ హత్యకు ప్లాన్ చేశాడు. ఈ నెల 8న అర్ధరాత్రి బుజ్జి గొంతు కోసి హత్య చేశాడు. బుజ్జి మృతదేహాన్ని ఇంట్లోనే తగలబెట్టి.. బయటకు పరిగెత్తుకు వచ్చి.. ఏమీ తెలియనట్లు బుజ్జి ఇంట్లో మంటలు చెలరేగాయి అంటూ.. కేకలు పెట్టి చుట్టు పక్కలవాళ్లను లేపాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాల్ డేటా ఆధారంగా జుల్ఫికర్ ఆలీయే హత్య చేశాడని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
Also Read: Tirumala: మే 15 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు
పోలీసులు తెలిపిన వివరాలు..
ఇన్స్పెక్టర్ రౌతు గోపీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కేతావత్ బుజ్జి అలియాస్ లక్ష్మి(40) కేశవగిరి హిల్స్ ప్రాంతంలో ఏడేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకుంటోందని.. లేబర్ అడ్డా మీద కూలి పనికి వెళ్లేదని చెప్పారు. భర్త రూప్లా పెళ్ళయిన ఐదేళ్లకే మృతిచెందాడని, ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడన్నారు. ఇదిలావుండగా రోజుమాదిరిగానే బుజ్జి బుధవారం (7వ తేదీ) పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిందని, చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా అందరూ కూలీలే నివాసముంటున్నారన్నారు. అందరూ రాత్రి భోజనాలు ముగించుకొని నిద్రపోయాక.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో (8వ తేదీ గురువారం) ఇంట్లోనుంచి పొగ రావడం గమనించిన స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారని, అందరూ సాధారణ అగ్నిప్రమాదమే అనుకున్నారని ఎస్ఐ తెలిపారు.
కాలిన మృత దేహం..
మంటలను ఆర్పిన తర్వాత లోపలికి వెళ్లి చూడగా కేతావత్ బుజ్జి చనిపోయి ఉందని, మృతదేహం కాలుతూ ఉందని, వెంటనే డయల్ 100కు స్థానికులు కాల్ చేశారని ఎస్ఐ తెలిపారు. నైట్ డ్యూటీలో ఉన్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత, బండ్లగూడ ఇన్స్పెక్టర్ గుర్నాద్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారన్నారు. మహిళ గొంతు కోసి ఉందని, స్థానికులు మంటలను ఆర్పివేయడంతో మృతదేహం స్వల్పంగా కాలిందన్నారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి.. కేసు దర్యాప్తు చేయగా జుల్ఫికర్ ఆలీయే ఆమెను హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెంట్స్..
YCP: మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
For More AP News and Telugu News