Share News

Crime News: కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి...

ABN , Publish Date - Jun 10 , 2025 | 09:54 AM

Crime News: న్యాయవాది శైలేష్ సక్సేనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లో కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి... ‘నీ సంగతి చూస్తాం.. ఈరోజు నీ పని అయిపోయింది’.. అంటూ హెచ్చరించారు. ఈ ఘటనతో భయపడిన న్యాయవాది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Crime News: కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి...
Crime News

హైదరాబాద్: న్యాయవాది (Lawyer) శైలేష్ సక్సేనా (Shailesh Saxena)కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లో కారు (Car)లో వెంబడించి.. తుపాకీతో బెదిరించి (Gunpoint Threat)... ‘నీ సంగతి చూస్తాం.. ఈరోజు నీ పని అయిపోయింది’.. అంటూ హెచ్చరించారు. ఈ ఘటనతో భయపడిన న్యాయవాది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు (Police Complaint) చేశారు. తాను ల్యాండ్‌ కేసుల్లో (Land dispute legal case) వాదిస్తుంటానని, దీంతో తనకు అనేక మంది శత్రువులు ఉన్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇదిలా ఉండగా న్యాయవాది శైలేష్‌ సక్సేనాపై గతంలో బోజగుట్ట భూముల కబ్జాతో పాటు పలు రకాలైన సివిల్‌ క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులకు సంబందించి గతంలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా శైలేష్‌ సక్సేనా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.


కాగా ఆదివారం డీసీఏంకు నిప్పు పెట్టిన ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. జంతు కళేబరాలు తరలిస్తున్నారని.. కొంతమంది యువకులు డీసీఏంను ఆపి డ్రైవర్‌పై దాడి చేసి వాహనానికి నిప్పు పెట్టారు. అక్కడకు వచ్చిన పోలీసులపైనా రాళ్ళు రువ్వారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 15 మంది యువకులను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ ఘటన రాజేంద్రనగర్ మైలార్‌దేవుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.


మరోవైపు వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. అర్థరాత్రి తల్లి కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గండు నర్సమ్మ (60) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కొడుకు రాజేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది...


ఇవి కూడా చదవండి:

కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యాచరణ

భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 10 , 2025 | 09:56 AM