Share News

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

ABN , Publish Date - Jan 27 , 2025 | 10:12 AM

హుస్సేన్‌సాగర్‌లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో నాగారానికి చెందిన అజయ్ అనే యువకుడు మిస్సింగ్ అయ్యాడు. బోట్‌లలో ఉన్నవారు స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. అజయ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. అతను ఏ ఆస్పత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar)లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం (fire accident) ఘటనలో ఓ యువకుడి ఆచూకీ తెలియడంలేదు. అగ్ని ప్రమాదంలో రెండు బోట్లు (Boats) దగ్ధమవగా ఒక్క బోటులో ఫ్రండ్స్‌తో వెళ్లిన అజయ్ (21) (Ajay) అనే యువకుడు కనిపించడం లేదు. అజయ్‌తోపాటు వెళ్లిన ఫ్రండ్స్ (Friends) మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అజయ్ ఏ ఆస్పత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజయ్ ఫ్రండ్స్ నుంచి లేక్ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు


భరతమత మహా హారతిలో అపశ్రుతి

కాగా భరతమాత పౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు బోట్లలో బాణసంచా పేల్చడానికి కొందరు యువకులు రెండు బోట్లలో హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి వెళ్లారు. బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వులు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. నిప్పురవ్వలు తిరిగి అవే బోట్లలో ఉంచిన బాణసంచాపై పడటంతో బోట్లకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు బోట్లు దగ్ధం కాగా.. అందులో ఉన్నవారు స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నాగారానికి చెందిన అజయ్ తన కొలిగ్స్‌తో కలిసి హుస్సేన్‌సాగర్‌కు వచ్చాడు. అయితే బోట్స్‌లో అజయ్ ఉన్నట్లు ఫ్రండ్స్ చెబుతున్నారు. బోట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్నవారు అందరూ నీటిలోకి దూకారు. అదే సమయంలో అజయ్‌తోపాటు అతని స్నేహితులు ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే అజయ్ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ ఎక్కడా ఏ ఆస్పత్రిలో జాయిన్ కాలేదని.. ఇదే విషయాన్ని పోలీసులు కూడా స్పష్టం చేశారు. అజయ్ అనే పేరుతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ కాలేదని, క్షతగాత్రుల వివరాల్లో అజయ్ పేరు లేదని పోలీసులు తెలిపారు. దీంతో అజయ్ ఏమయ్యాడనే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కాగా ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమంలో ఆయనతోపాటు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే కార్యక్రమం పూర్తయ్యాక పీపుల్స్‌ ప్లాజా సమీపంలో వేదిక వెనుక భాగంలో బాణసంచా కాల్చేందుకు పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లలో సామగ్రిని హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లారు. బోటులో డ్రైవర్‌, వాల్టర్‌, సిబ్బంది, బాణసంచా కాల్చే ఐదుగురు నిపుణులతోపాటు 15 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. అయితే బాణసంచా కాల్చే క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో బోట్లలో ఉన్న కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలోకి దూకారు. రంగంలోకి దిగిన అధికారులు.. జెట్టీలో మంటలను అదుపులోకి తెచ్చే పరికరాలు లేకపోవడంతో వారిని స్పీడ్‌బోట్‌లో బయటకు తీసుకువచ్చారు. అయితే ప్రమాదంలో బాణసంచా కాల్చే నిపుణుడు గణపతి (22)కి తీవ్ర గాయాలయ్యాయి. ఇతనితోపాటు ప్రమాదంలో గాయపడిన చింతల కృష్ణ (47), కరీంనగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి సాయిచంద్‌ను సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గణపతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, సీతాఫల్‌మండికి చెందిన బీజేపీ కార్యకర్తలు సునీల్‌, ప్రణీత్‌లకు స్పల్ప గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, కాలిపోయిన లూంబిని బోట్‌ విలువ రూ.12 లక్షలు ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి

కస్టోడియల్ టార్చర్ కేసు.. పోలీసుల కస్టడీకి తులసిబాబు..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 27 , 2025 | 10:12 AM