Share News

PC Ghosh Commission: కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు

ABN , Publish Date - Jun 09 , 2025 | 09:08 AM

Harish Rao: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

PC Ghosh Commission: కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు
Ex Minister Harish Rao

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)పై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ (Justice PC Ghosh Commission) విచారణ (Inquiry) తిరిగి ప్రారంభమైంది. విచారణలో భాగంగా కమిషన్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Ex Minister Harish Rao) హాజరుకానున్నారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు పని చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే కాళేశ్వం ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint presentation) ఇచ్చారు. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లే కుంగాయన్నారు. కాళేశ్వరంతో తెలంగాణలో 35 శాతం భూ భాగానికి నీరందని చెప్పారు. మరోవైపు కేసీఆర్ హయాంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ (ప్రస్తుత బీజేపీ ఎంపీ) ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ రోజు హారీష్ రావు విచారణలో ఎం చెబుతారో అన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు ఖజానా నుంచి చేసిన చెల్లింపులు, పాటించిన నిబంధనలపై కమిషన్ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్, పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నావళి సిద్ధం చేసింది.


కాగ్ నివేదికను పరిగణలోకి తీసుకున్న కమిషన్..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజినీర్లను, రిటైర్డ్ ఇంజినీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లను స్వీకరించి వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) నివేదికలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం నిర్మాణం సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది.


11న విచారణకు మాజీ సీఎం కేసీఆర్..

అలాగే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 11న (బుధవారం) జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు హాజరుకానున్నారు. విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతినిధుల విచారణలు తదుపరి కమిషన్ తుది నివేదికను ఈనెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేస్తుంది.


ఇవి కూడా చదవండి:

రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదు..: మంత్రి లోకేష్

ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 09 , 2025 | 09:08 AM