Share News

Fasiuddin: మాగంటి గోపినాథ్ శవ రాజకీయాలు..

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:09 AM

Fasiuddin emotional statement: ఎండీ సర్దార్ తనకు దగ్గరి వాడని .. అతని మరణం తనను కలిచి వేసిందని మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ అన్నారు. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నానని, కానీ అక్కడ తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ ప్రమాదవ శాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చారని.. కానీ...

Fasiuddin: మాగంటి గోపినాథ్ శవ రాజకీయాలు..
Fasiuddin emotional statement

Hyderabad: జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ (GHMC ex-deputy mayor), కాంగ్రెస్ కార్పొరేటర్ (Congress corporator) బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin) కంటతడి పెట్టుకున్నారు. బొరబండకు చెందిన సర్దార్ మరణాన్ని (Sardar Death) బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) రాజకీయం చేశారని ఆయన ఆరోపించారు. సర్దార్ ఆత్మహత్య చేసుకున్నా.. తానే కారణమన్నట్లుగా ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై దాడి చేయించేందుకు గోపీనాథ్ ప్రయత్నించారని ఆరోపించారు. సర్దార్ మరణానికి తాను కారణం కాదని అంతిమ యాత్రకు వెళ్లాలని అనుకున్నా.. శాంతి భద్రతలకు సమస్య అవుతుందని పోలీసులు వద్దని చెప్పారని ఫిసియుద్దీన్ వివరించారు.


మాగంటి గోపినాథ్ శవ రాజకీయాలు..

ఈ సందర్భంగా బుధవారం ఫసియుద్దీన్ మీడియాతో మాట్లాడారు. సర్దార్ తనకు దగ్గరి వాడని .. అతని మరణం తనను కలిచి వేసిందని అన్నారు. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నానని, కానీ అక్కడ తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ ప్రమాదవ శాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చారని.. కానీ సూసైడ్ చేసుకున్నాడని ఎమ్మెల్యే మాగంటి అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. మాగంటి గోపినాథ్ శవ రాజకీయాలు చేశారని, తనపై, తన ఇంటిపై మాగంటి దాడి చేయించడానికి ప్రయత్నించారని అన్నారు. తనపై దాడి చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని అన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కొంత మంది రౌడీ షీటర్లతో తనకు ప్రాణ హాని ఉందని.. ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరుతున్నానని ఫసియుద్దీన్ అన్నారు.


కాగా హైదరాబాద్‌లోని బోరబండ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ సర్దార్‌ (33) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బాబా ఫసియుద్దీన్‌ దంపతుల వేధింపులతోనే సర్దార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ బంధువులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసుస్టేషన్‌ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బోరబండ ప్రాంతంలో, ఫసియుద్దీన్‌ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్దార్‌ సోదరుడు ఇబ్రహీం ఫిర్యాదు మేరకు ఫసియుద్దీన్‌, ఆయన భార్య హబీబాషేక్‌, పీఏ సప్తగిరితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోదరుడు ఇటీవల ఇంటి ఆధునీకరణ పనులు చేపట్టారని.. దీనితో డబ్బులు డిమాండ్‌ చేస్తూ వారు వేధించారని ఇబ్రహీం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక సర్దార్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సర్దార్‌ మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jun 04 , 2025 | 11:09 AM