Share News

CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్

ABN , Publish Date - Apr 17 , 2025 | 08:41 AM

సీఎం రేవంత్‌రెడ్డి బృందం గురువారం జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ (జైకా) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అతి పెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు.

CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్
CM Revanth Reddy Busy Schedule in Japan

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం జపాన్‌ (Japan)లో బిజీ బిజీగా గడపనున్నారు. టోక్యో (Tokyo)లో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు సోనీ గ్రూప్ (Sony Group), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, JETRO, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌ (Japanese Bio Industry Association), వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని (Toshiba Factory) సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది.

Also Read..: వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు


జైకా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం..

అలాగే సీఎం రేవంత్‌రెడ్డి బృందం గురువారం జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ (జైకా) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అతి పెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు. రెండో దశ ప్రాజెక్ట్‌లో పార్ట్‌ -ఏ కింద 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా దీనిని చేపడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు రూ.24,269 కోట్లను కేటాయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30 శాతం నిధులు రూ.7,313 కోట్లు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 18 శాతం వాటాగా రూ.4,230 కోట్లు భరిస్తుంది.

మరో 48 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరీన్‌ గ్యారంటీతో జైకా, ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ), న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ), వంటి ఇంటర్నేషనల్‌ మల్టీ లేటరల్‌ సంస్థల నుంచి రూ.11,693 కోట్ల రుణాలను సేకరించనున్నారు. మిగతా 4శాతం పెట్టుబడి రూ.1033 కోట్లను పీపీపీ విధానంలో సమకూర్చుకుంటున్నారు. మొదటి దశ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.3 వేల కోట్ల వరకు జైకా రుణ సాయం చేసినట్లు తెలిసింది. అయితే కేవలం 2 శాతం వడ్డీతో రుణసాయం అందించే జైకా నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు సేకరించి ప్రాజెక్ట్‌ను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ టూర్‌లో జైకా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.


పెట్టుబడులే లక్ష్యంగా..

కాగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం టోక్యోకు చేరుకుంది. వారికి విమానాశ్రయంలో అక్కడి ప్రవాస తెలంగాణవాసులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితోపాటు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, టీజీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విష్ణువర్థన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌తోపాటు పలువురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వీరికి జపాన్‌లోని భారత రాయబారి షిబు జార్జ్‌ బుధవారం విందు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. (ఫోటో గ్యాలరీ)

వైసీపీ ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన తులాభారం కానుకలు స్వాహా

For More AP News and Telugu News

Updated Date - Apr 17 , 2025 | 08:41 AM