Share News

ACB: కాళేశ్వరం ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీ కోరిన ఏసీబీ..

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:43 PM

రిమాండ్‌లో ఉన్న ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

ACB: కాళేశ్వరం ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీ కోరిన ఏసీబీ..
ENC Hariram corruption case

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లో భారీ అక్రమాలకు పాల్పడి అరస్టయి (Arrest) రిమాండ్‌ (Remand)లో ఉన్న ఈఎన్‌సీ హరీరామ్‌ (ENC Hariram)ను కస్టడీ (custody)కి ఇవ్వాలంటూ ఏసీబీ (ACB) అధికారులు నాంపల్లి కోర్టు (Nampally Court)లో పిటిషన్ (Petition) వేశారు. వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే హరీ రామ్‌పై ఆదాయనికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. హరీ రామ్ నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే.

ఏసీబీ దర్యాప్తు ముమ్మరం..

కాగా కాలేశ్వరం ఈఎన్‌సీ హరి రామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆయన నివాసంలో సోదాలు చేసి భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. హరి రామ్‌ఫై ఆదాయనికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.200 కోట్ల స్థిర చరా ఆస్తులను అధికారులు గుర్తించారు. ఒక్క గజ్వేల్‌లోనే హరీ రామ్ 30 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. కాలేశ్వరం నిర్మాణం సమయంలోనే ఆయన భారీగా ఆస్తులను కూడాపెట్టుకున్నారు.

Also Read: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు


కోర్టులో కస్టడీ పిటీషన్..

ఏసీబీ అధికారులు హరీ రామ్‌ను అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్‌ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తన బినామీల గుట్టును హరిరామ్‌ బయటపెట్టలేదని సమాచారం. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఏసీబీ భావిస్తోంది. హరిరామ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించగా హరిరామ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.


హరిరామ్‌ చేతుల మీదుగా వేలకోట్ల ప్రాజెక్టుల పనులు..

కాళేశ్వరం ప్రాజెక్టు సహా నీటిపారుదల శాఖలోని పలు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో హరిరామ్‌ కీలకపాత్ర పోషించారు. హరిరామ్‌ చేతుల మీదుగా వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు జరిగాయి. ఈ క్రమంలోనే హరిరామ్‌ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా విలువ ఉండే ఆస్తులను ఇప్పటి వరకు గుర్తించామని అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఉన్న మర్కూక్‌ మండలంలో హరిరామ్‌ 28 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌, కొండాపూర్‌లో హరిరామ్‌కు రెండు విల్లాలుండగా వాటి విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక, హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ, మాదాపూర్‌, నార్సింగ్‌ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఫ్లాట్ల విలువ రూ.10 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఏపీ రాజధాని అమరావతిలో హరిరామ్‌కు ఉన్న వాణిజ్య స్థలం విలువ రూ.20 కోట్లు ఉండవచ్చునని చెబుతున్నారు. ఇవే కాక, పటాన్‌చెరు లాంటి కీలక ప్రాంతంలో 20 గుంటల స్ధలం, శ్రీనగర్‌ కాలనీలో రెండు ఇండిపెండెంట్‌ ఇళ్లు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల మామిడితోటలో ఖరీదైన ఫామ్‌హౌస్‌, కొత్తగూడెంలో ఓ వాణిజ్య సముదాయం, కుత్బుల్లాపూర్‌, మిర్యాలగూడలో ఇళ్ల స్థలాలు గుర్తించారు. హరిరామ్‌కు చెందిన కొన్ని బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా

వైసీపీ హయాంలో జరిగిన పాపాలు బయటకు..

ఏపీలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభ వార్త..

For More AP News and Telugu News

Updated Date - Apr 29 , 2025 | 01:46 PM