Share News

Hyderabad: 8న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం

ABN , Publish Date - May 29 , 2025 | 07:55 AM

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జూన్ 8వతేదీ నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

Hyderabad: 8న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం

హైదరాబాద్: ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి జూన్‌ 8న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌(Nampally Exhibition Ground)లో ఉదయం 10 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు బత్తిని గౌడ్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో మృగశిర కార్తే ప్రారంభమవుతుందని అప్పటి నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందన్నారు.


city2.2.jpg

బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని గౌడ్‌ కుటుంబ సభ్యులు బత్తిని అమర్‌నాథ్‌గౌడ్‌, శివశంకర్‌గౌడ్‌, గౌరీశంకర్‌గౌడ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, సంతోష్‏గౌడ్‌, శివగౌడ్‌లు మాట్లాడారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది వస్తున్నట్లు అంచనా వేస్తున్నామని అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


city3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క

ఒకే మాటపై ఉందాం!

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 02:56 PM