Hyderabad: వణికిస్తున్న చలి.. శివారులో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:16 AM
గ్రేటర్లో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండడంతో వాహనదారులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుండడంతో ఇళ్లలోని ప్రజలూ వణికిపోతున్నారు.
- శేరిలింగంపల్లిలో 11.8 డిగ్రీలు నమోదు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్లో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండడంతో వాహనదారులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుండడంతో ఇళ్లలోని ప్రజలూ వణికిపోతున్నారు. చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రేటర్లో వారం రోజులుగా చలి ప్రభావం గణనీయంగా పెరిగిపోతోంది.
ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నగరవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటున్నప్పటికీ, సాయంత్రం 5 తర్వాత పూర్తిగా మారిపోయి చల్లని వాతావరణం ఏర్పడుతోంది. నగర పరిధిలో కన్నా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా కనిపిస్తోంది. దీంతో ఆయా చోట్ల రాత్రి 8 గంటలకే రోడ్లపై రాకపోకలు తగ్గుతున్నాయి. ఇదిలా ఉండగా, గురువారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30.2 డిగ్రీలుండగా.. కనిష్ట 14.4 డిగ్రీలుగా నమోదైంది. సాధారణ ఉషోగ్రతల కంటే రెండు, మూడు రోజులుగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్న పరిస్థితి నెలకొంది.

గ్రేటర్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు...
ప్రాంతం - డిగ్రీలు
శేరిలింగంపల్లి 11.8
రామచంద్రాపురం 12.5
రాజేంద్రనగర్ 12.9
చందానగర్ 13.3
సికింద్రాబాద్ 13.6
కుత్బుల్లాపూర్ 13.7
అల్వాల్ 14.0
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీ బాంబు పేలుళ్లు.. వారిపై రఘునందన్ రావు ఫైర్
Read Latest Telangana News and National News