Hyderabad: అద్దె చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:03 AM
బాగ్లింగంపల్లిలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ హైస్కూల్ భవనానికి 13 నెలల అద్దె చెల్లించలేదని భవన యజమాని సోయల్ కొఠారి గురువారం గేటుకు తాళం వేశాడు.

- బయటే నిలబడిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు
- కలెక్టర్ హామీతో తాళం తీసిన భవన యజమాని
హైదరాబాద్: బాగ్లింగంపల్లి(Baglingampalli)లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ హైస్కూల్ భవనానికి 13 నెలల అద్దె చెల్లించలేదని భవన యజమాని సోయల్ కొఠారి గురువారం గేటుకు తాళం వేశాడు. పాఠశాల ప్రారంభమవడంతో వచ్చిన ప్రిన్సిపాల్ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు గంటల తరబడి బయటే నిలబడ్డారు. ప్రిన్సిపాల్ హిమాయత్నగర్ తహసీల్దార్ సంధ్యారాణి(Himayatnagar Tahsildar Sandhyarani), ఎమ్మెల్యే ముఠాగోపాల్కు సమాచారం ఇచ్చారు.
వారు భవన యజమానితో చర్చలు జరపగా అద్దె చెల్లించాల్సిందేనన్నాడు. దీంతో తహసీల్దార్ విషయం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ భవన యజమానితో మాట్లాడి ఐదు నెలల అద్దె చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పాఠశాల గేటుకు వేసిన తాళం తీశాడు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ఎ్ఫఐ నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి, డీవైఎఫ్ నాయకుడు జావెద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ
రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు
Read Latest Telangana News and National News